భారత్ లో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. కొత్తగా దేశవ్యాప్తంగా 50356 పాజిటివ్ కేసులు, 577 మరణాలు నమోదయ్యాయి. దీంతో నవంబర్ 7, శనివారం ఉదయానికి దేశంలో కేసుల సంఖ్య 84,62,080 కు, మరణాల సంఖ్య 1,25,562 కి పెరిగినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మరోవైపు గత 24 గంటల్లో 53,920 మంది కోలుకోవడంతో, మొత్తం రికవరీల సంఖ్య 78,19,886 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 92.41 శాతంగా ఉండగా, మరణాల రేటు 1.48 శాతంగా నమోదైంది.
దేశంలో కరోనా కేసులు వివరాలు (నవంబర్ 7, ఉదయం 8 గంటల వరకు):
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 84,62,080
- కొత్తగా నమోదైన కేసులు [నవంబర్ 6–నవంబర్ 7 (8AM-8AM)] : 50356
- నమోదైన మరణాలు : 577
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 78,19,886
- యాక్టీవ్ కేసులు : 5,16,632
- మొత్తం మరణాల సంఖ్య : 1,25,562
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ