బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ అధినేత నితీష్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ రోజు బీహార్ రాజ్భవన్లో జరిగిన ప్రమాణస్వీకార కార్యక్రమంలో గవర్నర్ ఫగు చౌహాన్ నితీష్ కుమార్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. నితీష్ కుమార్ సీఎంగా బాధ్యతలు స్వీకరించడం ఇది వరుసగా నాలుగోసారి కాగా, మొత్తంగా ఏడోసారి. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఎన్డీఏ కూటమి నాయకులు హాజరయ్యారు. అలాగే ఎన్డీఏ కూటమిలో భాగంగా బీజేపీ నుంచి తార్కిషోర్ ప్రసాద్, రేణుదేవి డిప్యూటీ సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరితో పాటుగా మరి కొందరు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (బీజేపీ+జనతాదళ్ యునైటెడ్+వీఐపీ+హెఛ్ఏఎంఎస్) 125 సీట్లు దక్కించుకుని విజయభేరి మోగించడంతో ఎన్డీఏ సీఎం అభ్యర్థి నితీష్ కుమార్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఆయన 14 సంవత్సరాలకు పైగా సీఎం పదవిలో ఉండగా, ఈ టర్మ్ తో బీహార్ లో అత్యధిక కాలం పదవిలో ఉన్న సీఎంగా రికార్డు సృష్టించనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగమైన బీజేపీకి 74 సీట్లు, జేడీయూకి 43, వీఐపీకి 4, హెఛ్ఏఎంసెక్యూలర్ కు 4 సీట్లు లభించాయి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ