స్టార్ షట్లర్ పీవీ సింధు రెండున్నర సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. భారత స్టార్ షట్లర్ పీవీ సింధు మరో అంతర్జాతీయ టైటిల్ను సొంతం చేసుకుంది. ఆదివారం ముగిసిన ‘సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ ‘టోర్నీలో టాప్ సీడ్ పీవీ సింధు మహిళల సింగిల్స్ విభాగంలో విజేతగా నిలిచింది. భారత్కే చెందిన యువ క్రీడాకారిణి మాళవిక బన్సోద్తో 35 నిమిషాలపాటు సాగిన పోరాటంలో చివరకు సింధుదే పైచేయి అయ్యింది. ఆదివారం ఏకపక్షంగా జరిగిన ఈ తుది పోరులో.. టాప్సీడ్ సింధు 21-13, 21-16తో గెలిచింది.
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ టైటిల్ను గెలవడం సింధుకిది రెండోసారి. 2019 ఆగస్టులో ప్రపంచ చాంపియన్షిప్లో టైటిల్ సాధించిన తర్వాత.. సింధు గెలిచిన మరో అంతర్జాతీయ టైటిల్ ఇదే కావడం విశేషం. చాంపియన్గా నిలిచిన సింధుకు 11,250 డాలర్ల ప్రైజ్మనీ (రూ. 8 లక్షల 55 వేలు), 7000 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి. సయ్యద్ మోదీ ఓపెన్లో సింధు విజేతగా నిలువడం ఇది రెండోసారి. 2017లోనూ సింధు ఈ టోర్నీలో చాంపియన్గా నిలిచింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF