రాష్ట్రంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండడంతో సిక్కిం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వారం రోజుల పాటుగా లాక్డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. జూలై 21, మంగళవారం ఉదయం 6 గంటల నుంచి జూలై 27 ఉదయం 6 గంటల వరకు లాక్డౌన్ విధించనున్నట్టు సిక్కిం ప్రభుత్వం వెల్లడించింది.
నిత్యావసర వస్తువులు, రేషన్, ఆహార పదార్థాలు మొదలైనవి అమ్మే దుకాణాలను ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంచడానికి అనుమతించారు, అలాగే మెడికల్ షాపులు రాత్రి 7 గంటల వరకు పనిచేయనున్నాయి. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ కార్యాలయాలు, పలు రకాల దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు మూసివేయబడతాయని చెప్పారు. ప్రైవేట్ వాహనాల ప్రయాణాలను కూడా నిషేధించారు. మరోవైపు సిక్కిం రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 305 కి చేరుకుంది. వీరిలో 92 మంది కరోనా నుంచి కోలుకోగా, 213 మంది చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu