భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య నాలుగు టెస్ట్ ల సిరీస్ ప్రస్తుతానికి 1-1 తో సమం అయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇరుజట్ల మధ్య మూడోదైనా డే అండ్ నైట్(పింక్ బాల్) టెస్ట్ రేపు (ఫిబ్రవరి 24, బుధవారం) మధ్యాహ్నం 2:30 గంటలకు మొతెరా స్టేడియంలో ప్రారంభం కానుంది. రెండో టెస్టులో ఘనవిజయం సాధించి ఊపు మీదున్న భారత్ జట్టు మూడో టెస్టులో కూడా ఇంగ్లాండ్ పై సత్తా చాటేందుకు సిద్దమవుతుంది. ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ పోరులో నిలిచేందుకు ఇరుజట్లకు ఈ టెస్ట్ మ్యాచ్ అత్యంత కీలకం కానుంది. మరోవైపు 1 లక్షా 10 వేలు సీటింగ్ సామర్ధ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంగా గుర్తింపు పొందిన మొతెరా స్టేడియంలో తొలి అంతర్జాతీయ మ్యాచ్ గా రేపు మూడో టెస్టు జరగబోతుంది.
మరోవైపు ఈ టెస్ట్ మ్యాచ్ కు ముందు భారత్ ఆటగాళ్లలో కొందరు కీలక మైలురాళ్ళకు చేరువలో ఉన్నారు. స్వదేశంలో టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత్ కెప్టెన్ నిలిచేందుకు విరాట్ కోహ్లీ ఒక విజయం దూరంలోనే ఉన్నాడు. ప్రస్తుతం కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోనీ 21 విజయాలతో సమానంగా ఉన్నారు. బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ 400 వికెట్లు క్లబ్ లో చేరేందుకు ఆరు వికెట్లు దూరంలో ఉన్నాడు. అలాగే ఈ మ్యాచ్ తో కపిల్దేవ్ తర్వాత 100 టెస్టులు ఆడిన రెండో భారత్ బౌలర్ గా ఇషాంత్ శర్మ నిలవనున్నాడు.
మూడో టెస్టుకు భారత్ తుదిజట్టు అంచనా: రోహిత్ శర్మ, శుబ్ మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ (కెప్టెన్), అజింక్య రహానె (వైస్ కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, ఇశాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా.
ఇంగ్లాండ్ తుదిజట్టు అంచనా: రోరి బర్న్స్/జాక్ క్రాలే, డోమ్ సిబ్లీ, బెయిర్స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఆలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డోమ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ ఆండర్సన్.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ