కరీంనగర్ లో మంచినీటి పథకాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Daily Water Supply Programme, Daily Water Supply Programme In Karimnagar, Karimnagar, KTR Daily Water Supply Programme, KTR Launched Daily Water Supply Programme, Minister KTR, Minister KTR Launched Daily Water Supply, Water Supply Programme

తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమ శాఖల మంత్రి ‌కేటీఆర్ జూలై 21, మంగళవారం నాడు కరీంనగర్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో 110 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన మెయిన్‌ బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. దీనిద్వారా కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో ఇకపై ప్రతి రోజు శుద్ధిచేసిన మంచి నీరు అందనుంది.

ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కరీంనగర్‌లో మంచి నీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ లో ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని, 24/7 త్రాగునీరు సరఫరా కూడా ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. అనంతరం కరీంనగర్ లో ఐటీ టవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్ ను 83,000 చదరపు అడుగులలో నిర్మించారు. ఈ టవర్ లో కంపెనీలకు స్పేస్ కేటాయించడం కూడా ఇప్పటికే ప్రారంభమైంది.

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + 6 =