తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమ శాఖల మంత్రి కేటీఆర్ జూలై 21, మంగళవారం నాడు కరీంనగర్లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శాతవాహన యూనివర్సిటీలో 110 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన మెయిన్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దీనిద్వారా కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో ఇకపై ప్రతి రోజు శుద్ధిచేసిన మంచి నీరు అందనుంది.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, కరీంనగర్లో మంచి నీటిని అందించే కార్యక్రమంలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. కరీంనగర్ లో ఏ పని ప్రారంభించినా విజయవంతం అవుతుందని, 24/7 త్రాగునీరు సరఫరా కూడా ఇక్కడ నుంచే ప్రారంభం కావాలని అన్నారు. అనంతరం కరీంనగర్ లో ఐటీ టవర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఈ ఐటీ టవర్ ను 83,000 చదరపు అడుగులలో నిర్మించారు. ఈ టవర్ లో కంపెనీలకు స్పేస్ కేటాయించడం కూడా ఇప్పటికే ప్రారంభమైంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu