దేశంలో సెప్టెంబర్ 25 నుంచి మళ్ళీ లాక్‌డౌన్ అమలు రూమర్లపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం

Fact Check Over False Rumors on Coronavirus, India Lockdown, Lockdown, Lockdown In India, PIB Fact Check, PIB Fact Check Clarifies Rumours, PIB Fact Check Clarifies Rumours over Complete Lockdown, PIB Fact Check Denies Lockdown Extension Rumours, Rumours over Complete Lockdown, Rumours over Complete Lockdown Again in India

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించి, అన్‌లాక్ ప్రక్రియ మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెప్టెంబర్ 1 నుంచి కేంద్రం జారీ చేసిన అన్‌లాక్‌-4 మార్గదర్శకాలు అమల్లోకి వచ్చాయి. అయితే దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతూనే ఉంది. ఇటీవల ప్రతిరోజూ 90 వేలకు పైగానే కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సెప్టెంబర్ 15, మంగళవారం ఉదయానికి దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 49,30,236 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25 నుంచి దేశవ్యాప్తంగా మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేయాలని జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. దీనిపై పిఐబి (భారత ప్రభుత్వ పత్రికా సమాచార కార్యాలయం) ఫాక్ట్ చెక్ స్పందించింది. ప్రచారంలో ఉన్న ఉత్తర్వులు ఫేక్ అని, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మళ్ళీ పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధించడంపై ఎలాంటి ఉత్తర్వులను జారీ చేయలేదని పిఐబి ఫాక్ట్ చెక్ వెల్లడించింది. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు, సంబంధిత విషయాలపై సోషల్ మీడియాలో జరిగే అనేక తప్పుడు ప్రచారాలపై పిఐబి ఫాక్ట్ చెక్ నిజ నిర్ధారణ చేసి వివరణ ఇస్తూ ఉంటుంది.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 + thirteen =