ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా చివరిదైన ఆస్ట్రేలియాకు చేరుకున్నారు. ఈ క్రమంలో సోమవారం రాత్రి ఆస్ట్రేలియా రాజధాని సిడ్నీ చేరుకున్న ఆయనకు ఆస్ట్రేలియా అధికార ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అలాగే విమానాశ్రయం వద్ద ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల నుంచి ఘన స్వాగతం లభించింది. కాగా అక్కడ 22-24 తేదీల మధ్య ప్రధాని మోదీ పర్యటించనుండగా.. ఈ రోజు అంటే మంగళవారం ఆస్ట్రేలియాలోని ప్రవాస భారతీయులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసగించనున్నారు. కాగా ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2016 జనాభా లెక్కల ప్రకారం, ఆస్ట్రేలియాలో మొత్తం 6,19,164 మంది భారత్కి చెందినవారు ఉన్నారు. కాగా ప్రధాని మోదీ చివరిసారిగా 2014లో ఆస్ట్రేలియాలో పర్యటించారు.
ఇక ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ.. ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాలు సన్నిహిత సంబంధాలను ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తున్నందున రక్షణ, వాణిజ్యం, పునరుత్పాదక ఇంధనం మరియు వ్యాపారంపై రాబోయే రెండు రోజుల్లో చర్చలు జరపనున్నారు. ఈ క్రమంలో నేటిరాత్రి సిడ్నీ ఒలింపిక్ పార్క్లో జరిగే కమ్యూనిటీ ఈవెంట్కు మోదీ మరియు అల్బనీస్ కూడా హాజరవుతారు. ఇక ఈ కార్యక్రమంలో ఆస్ట్రేలియన్ ఇండియన్ కమ్యూనిటీకి చెందిన 20,000 మందికి పైగా సభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది. కాగా అమెరికా జాతీయ రుణ సమస్యలపై దృష్టి సారించేందుకు ఆ దేశాధ్యక్షుడు జో బిడెన్ గైర్హాజరుతో అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ మరియు భారతదేశానికి చెందిన నాయకులతో ఈ వారం సిడ్నీలో జరగాల్సిన క్వాడ్ సమావేశం రద్దు చేయబడిన విషయం తెలిసిందే. దీనికి బదులుగా క్వాడ్ నాయకులు వారాంతంలో జపాన్లో జీ7 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ జీ7 సమావేశాలలో పాల్గొన్న అనంతరం ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE