దేశంలో కరోనా వైరస్ ప్రభావం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పలు పార్టీల కీలక నేతలు సైతం కరోనా బారినపడ్డారు. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని సమాజ్ వాదీ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. “ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయనపై వైద్యుల పర్యవేక్షణ కొనసాగుతుంది. ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవు” అని ట్వీట్ చేశారు.
మరోవైపు ములాయం కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో స్పందిస్తూ, తన తండ్రి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా స్థిరంగా ఉందని, కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గురుగ్రామ్లోని మేదాంత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. సీనియర్ వైద్యులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెలియజేస్తూ ఉంటామని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu