రజనీకాంత్‌ కు దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు, అభినందనలు తెలిపిన పీఎం మోదీ, సీఎం కేసీఆర్

2021 51st Dadasaheb Phalke Award, 2021 Dadasaheb Phalke Award, 51st Dadasaheb Phalke Award, 51st Dadasaheb Phalke Award 2021, 51st Dadasaheb Phalke award for Rajinikanth, Mango News, Rajinikanth, Rajinikanth to be conferred with 51st Dadasaheb Phalke, Rajinikanth to be honoured with 51st Dadasaheb Phalke Award, Super Star Rajinikanth, Super Star Rajinikanth To Be Conferred With 51st Dadasaheb Phalke Award, Superstar Rajinikanth

సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రజనీకాంత్‌ కు అభినందనలు తెలియజేశారు. “తరాలుగా ప్రాచుర్యం పొందుతూ, కఠోరంగా శ్రమించే వ్యక్తుల్లో ఒకరుగా ఉంటూ, విభిన్నమైన పాత్రలతో అలరించే, మంచి మనసున్న వ్యక్తి రజనీకాంత్. తలైవాకు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు” అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

చలనచిత్ర రంగంలో అత్యున్నత పురస్కారం, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అశేష ప్రజాదరణ పొందిన దక్షిణాది తమిళ ప్రముఖ నటుడు రజనీకాంత్ కు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంపట్ల ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తంచేశారు. నటుడుగా దశాబ్దాల పాటు తనకంటూ ఒక ప్రత్యేక శైలిని చాటుకుంటూ, నేటికీ దేశ విదేశాల్లో కోట్లాదిమంది అభిమానుల ఆదరణ పొందుతున్న రజనీకాంత్ కు ఫాల్కే అవార్డు రావడం గొప్ప విషయం అని సీఎం అన్నారు. ఈ సందర్భంగా అవార్డు గ్రహీత సినీ హీరో రజనీకాంత్ కు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు కమలహాసన్, మెగాస్టార్ చిరంజీవి, మోహన్ బాబు, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రవితేజ సహా పలువురు ప్రముఖ నటులు ఈ సందర్భంగా రజనీకాంత్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 + three =