ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ఎన్నికల కమిషనర్ గా(ఎస్ఈసీ) నీలం సాహ్ని గురువారం నాడు బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఎస్ఈసీగా ఉన్న నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31, 2021 తో ముగిసింది. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషన్ కార్యాలయ ఉద్యోగులు ఆమెకు పుష్పగుచ్చాలు అందించి, అభినందనలు తెలిపారు.
ముందుగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం మార్చి 31తో పూర్తవుతున్న నేపథ్యంలో, నూతన ఎస్ఈసీ నియామకంపై ఏపీ ప్రభుత్వం కసరత్తు నిర్వహించి ముగ్గురు రిటైర్ట్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్ ను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు పంపింది. అనంతరం ఆ ముగ్గురిలో నూతన ఎస్ఈసీగా నీలం సాహ్ని నియామకానికి గవర్నర్ ఆమోదం తెలిపారు. ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించే క్రమంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య సలహాదారు పదవికి కూడా నీలం సాహ్ని రాజీనామా చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ