గుజరాత్‌లో ప్రధాని మోదీతో ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ ద్వైపాక్షిక చర్చలు

PM Modi Holds Bilateral Meet with UN Secretary General Antonio Guterres in Gujarat Today, PM Modi, UN Secretary General Antonio Guterres, Modi Bilateral Meet with UN Secretary General, Mango News, Mango News Telugu, UN Secretary General Antonio Guterres, Indian Prime Minister, Indian Prime Minister Modi, Prime Minister Modi, PM Modi Latest News And Updates, PM Modi Meet Antonio Guterres in Gujarat, PM Modi Gujarat Tour, Gujarat Tour,

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం గుజరాత్‌లోని కెవాడియాలో ద్వైపాక్షిక సమావేశం నిర్వహించారు. బుధవారం నుంచి మూడు రోజుల భారత్ పర్యటనలో ఉన్న గుటెర్రెస్‌తో మోదీ సుదీర్ఘంగా సంభాషించారు. ఈ సందర్భంగా వీరిరువురూ కలిసి ‘మిషన్ లైఫ్’ (పర్యావరణానికి జీవనశైలి)ని ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల సమస్య ప్రతిచోటా ఎదురవుతోందని, అందుకే ఈ మిషన్ లైఫ్ ద్వారా స్థిరత్వం వైపు ప్రజల సామూహిక విధానాన్ని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని లక్ష్యంగా పెట్టుకుందని గుటెరస్‌ తెలిపారు. ధృవాలవద్ద ఉండే హిమానీనదాలు కూడా క్రమక్రమంగా కరిగిపోతున్నాయని, అదేసమయంలో మరోవైపు నదులు ఎండిపోతున్నాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మిషన్ లైఫ్ సహాయం చేస్తుందని, సుస్థిర అభివృద్ధి దిశగా ప్రజల సమష్టి వైఖరిని మార్చడానికి త్రిముఖ వ్యూహాన్ని అమలు చేయడం మిషన్ లైఫ్ లక్ష్యమని ఈ సందర్భంగా ఇరువురు నేతలూ అభిప్రాయపడ్డారు. ఇక ఈ కార్యక్రమం అనంతరం గుటెరస్‌.. దేశంలోనే మొట్టమొదటి సోలార్ పవర్డ్ గ్రామాన్ని, మొధేరాలోని సూర్య దేవాలయాన్ని గుటెరస్ సందర్శించనున్నారు. కాగా గుటెరస్ మూడు రోజుల పర్యటన నిమిత్తం ఈ నెల 18న భారత్ వచ్చారు. బుధవారం ఆయన ముంబైలో పర్యటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =