నేడు అయోధ్యలో లతా మంగేష్కర్ చౌక్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

PM Modi Inaugurates Lata Mangeshkar Chowk in Ayodhya Today on Her Birth Anniversary,PM Modi inaugurated Lata Mangeshkar Chowk, Modi Opened Lata Mangeshkar Chowk, Lata Mangeshkar Chowk, PM Modi, Mango News, Mango News Telugu, Lata Mangeshkar Chowk in Ayodhya, Pm Modi Inaugurates Lata Mangeshkar Chowk In Ayodhya, PM Narendra Modi, Narendra Modi Indian Prime Minister, Indian PM Narendra Modi, Indian PM, PM Narendra Modi Latest News And Updates, Lata Mangeshkar, Lata Mangeshkar Songs, Lata Mangeshkar News And Live Updates

దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మేరకు బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మంగేష్కర్ 93వ జయంతి సందర్భంగా.. ఆమె పేరుతో అయోధ్యలోని ఒక కూడలిని లతా మంగేష్కర్ చౌక్‌ను ప్రారంభించారు. ఈ చౌక్ వద్ద 40 అడుగుల పొడవు మరియు 12 అడుగుల ఎత్తులో సరస్వతీ దేవి చిత్రం చెక్కబడిన వీణ శిల్పం ఏర్పాటు చేయబడింది. ఇది చూపరులను విశేషంగా ఆకర్షిస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీనిని ప్రారంభించిన ప్రధాని మోదీ లతా మంగేష్కర్‌ను స్మరించుకుని నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్, ఇక్కడ సరస్వతీ దేవి ఉంది. వీణ స్థాపించబడింది, ఆమె సంగీత ధ్యానానికి చిహ్నంగా ఉంటుందని పేర్కొన్నారు. పాలరాతితో చేసిన 92 కమలాలు లతా మంగేష్కర్ జీవితానికి ప్రతీకగా నిర్మాణంలో ఒక భాగమని ఆయన తెలిపారు. లతాజీ జయంతి సందర్భంగా ఆమెను స్మరించుకోవడం గొప్ప విషయం. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. ఈరోజు అయోధ్యలోని ఒక చౌక్‌కి ఆమె పేరు పెట్టడం పట్ల నేను సంతోషిస్తున్నాను. ఇది గొప్ప భారతీయ దిగ్గజాలలో ఒకరికి సముచితమైన నివాళి అని ప్రధాని మోదీ అన్నారు. కాగా 1929లో జన్మించిన లతా మంగేష్కర్ ఎనిమిది దశాబ్దాల కెరీర్‌ను కలిగి ఉన్నారు. ఆమెకు భారతరత్న కూడా లభించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 6న ఆమె తుది శ్వాస విడిచారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =