ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి మరింతగా విజృంభిస్తుంది. రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1100 దాటింది. ఏప్రిల్ 27, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్-19 పరీక్షల్లో కొత్తగా 80 కేసులు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యాయి. కొత్తగా కృష్ణా జిల్లాలో 33, గుంటూరు జిల్లాలో 23, కర్నూల్ లో 13, నెల్లూరు జిల్లాలో 7, పశ్చిమ గోదావరిలో 3, శ్రీకాకుళంలో ఒక కేసు చొప్పున మొత్తం 80 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1177 కు పెరిగింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసులకు గాను 235 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం 911 మంది చికిత్స పొందుతున్నారు.
మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 26, ఆదివారం సాయంత్రానికి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య 1001 కు చేరినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 11 కేసులు నమోదైనట్టు పేర్కొన్నారు. అలాగే ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 25 మంది మృతి చెందగా, 316 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్టు తెలిపారు. ప్రస్తుతం 660 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో జరిగిన కోవిడ్19 పరీక్షల్లో 80 కేసు లు పాజిటివ్ గా నమోదయ్యాయి.
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 1177 పాజిటివ్ కేసు లకు గాను 235 మంది డిశ్చార్జ్ కాగా, 31 మంది మరణించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 911. pic.twitter.com/xVT5GjbE31— ArogyaAndhra (@ArogyaAndhra) April 27, 2020
Media Bulletin
Date: April 26, 2020District wise status update on #Coronavirus positive cases in Telangana pic.twitter.com/yUPaWsEMWO
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 26, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]