భారత్ లో కోవిడ్-19 (కరోనావైరస్) మహమ్మారి విజృంభణ కొనసాగుతుంది. దీంతో గత కొన్నిరోజులుగా ప్రతిరోజూ 30 వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లోనే కొత్తగా 34,884 కరోనా కేసులు, 671 కరోనా మరణాలు నమోదయ్యాయి. జూలై 16, గురువారం ఉదయానికి దేశంలో మొత్తం కేసుల సంఖ్య 10,38,716 కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే కరోనా మరణాల సంఖ్య 26,273 కి చేరుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నప్పటికీ, కోలుకుంటున్న వారి శాతం ఎక్కువ ఉండడం ఊరట కలిగిస్తుంది. ప్రస్తుతం కరోనా బాధితుల రికవరీ రేటు 62.94 శాతంగా ఉన్నట్టు ప్రకటించారు.
దేశంలో కరోనా కేసులు వివరాలు (జూలై 18, ఉదయం 8 గంటల వరకు) :
- దేశంలో మొత్తం పాజిటివ్ కేసులు : 10,38,716
- కొత్తగా నమోదైన కేసులు (జూలై 17 – జూలై 18 (8AM-8AM) : 34,884
- నమోదైన మరణాలు : 671
- డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య : 6,53,750
- యాక్టీవ్ కేసులు : 3,61,024
- మొత్తం మరణాల సంఖ్య : 26,273
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu