ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం సాయంత్రం 5 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ సహా పలు అంశాలపై కీలక ప్రకటన చేశారు. దేశంలో కేంద్రీకృత వ్యాక్సిన్ డ్రైవ్ కింద అన్ని వ్యాక్సిన్లను కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, అన్ని రాష్ట్రాలకు ఉచితంగా అందజేస్తామని ప్రధాని మోదీ ప్రకటించారు. జూన్ 21 తేదీ నుంచి దేశంలో 18 సంవత్సరాలు పైబడినవారందరికీ కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందజేస్తుందని పేర్కొన్నారు.
ఇక 25% వ్యాక్సిన్లను ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందించడాన్ని కొనసాగిస్తామని, కరోనా వ్యాక్సినేషన్ నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని వ్యాక్సిన్లపై సర్వీస్ ఛార్జీ కింద రూ.150 మాత్రమే వసూలు చేయాలనీ ఆదేశాలు ఇచ్చారు. అలాగే ప్రధాన్ మంత్రి గరిబ్ కళ్యాణ్ అన్నా యోజన కింద పేదలకు ఉచిత రేషన్ అందించడాన్ని దీపావళి వరకు పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం ద్వారా మొత్తం 80 కోట్ల మందికి లబ్ది చేకూరనుందని చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ