ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జూన్ 9, గురువారం) ఉదయం 10:30 గంటలకు న్యూఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో “బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022″ను ప్రారంభించనున్నారు. అనంతరం ప్రధాని మోదీ కీలక ప్రసంగం చేయనున్నారు. బయోటెక్ స్టార్టప్ ఎక్స్పో-2022 ఈవెంట్ జూన్ 9,10వ తేదీల్లో రెండు రోజుల పాటుగా జరుగనుంది. దీన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ మరియు బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) నిర్వహిస్తున్నాయి. బీఐఆర్ఏసీ ఏర్పాటు చేసి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఎక్స్పోను నిర్వహిస్తున్నారు. ఈ ఎక్స్పో థీమ్ ను ‘బయోటెక్ స్టార్టప్ ఆవిష్కరణలు: ఆత్మనిర్భర్ భారత్ వైపు’ గా నిర్ణయించారు.
దేశంలో పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పరిశ్రమల ప్రముఖులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, బయో-ఇంక్యుబేటర్లు, తయారీదారులు, రెగ్యులేటర్లు, ప్రభుత్వ అధికారులు తదితరులను అనుసంధానం చేసేందుకు ఎక్స్పో వేదికగా పనిచేయనుంది. ఎక్స్పోలో దాదాపు 300 స్టాల్స్ను ఏర్పాటు చేస్తున్నారు. హెల్త్కేర్, జెనోమిక్స్, బయోఫార్మా, వ్యవసాయం, పారిశ్రామిక బయోటెక్నాలజీ, వేస్ట్-టు-వాల్యూ, క్లీన్ ఎనర్జీ వంటి వివిధ రంగాలలో బయోటెక్నాలజీ యొక్క అప్లికేషన్లను ఈ స్టాల్ల్స్ లో ప్రదర్శించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY