అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21, ఆదివారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. ఢిల్లీ నుంచి పీఎం మోదీ ఈ ప్రసంగం చేయనున్నారు. ఈ ప్రసంగంలో యోగా విశిష్టత గురించి మోదీ వివరించనున్నారు. అలాగే పీఎం మోదీ చేసే కొన్ని యోగాసనాలను కూడా టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చేసే అవకాశముంది. అలాగే ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జూన్ 19 నుండి 21 తేదీ వరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నమస్తే యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. యోగా దినోత్సవం రోజున సుమారు 10 మిలియన్ల మంది ప్రజలు సూర్య నమస్కారాలను చేస్తారని ఆశిసున్నట్లు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ పటేల్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu