భారతదేశం 2022, డిసెంబర్ 1 నుండి జీ-20 ప్రెసిడెన్సీ/జీ-20 సభ్య దేశాల గ్రూప్ అధ్యక్ష పదవి చేపట్టనున్న విషయం తెలిసిందే. అలాగే భారత్ తొలిసారిగా 2023లో జీ-20 సమ్మిట్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో భారతదేశం యొక్క G20 ప్రెసిడెన్సీ లోగో, థీమ్ మరియు వెబ్సైట్ను నవంబర్ 8, మంగళవారం సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది.
ప్రధాని మోదీ దార్శనికతతో మార్గనిర్దేశం చేయబడిన భారతదేశ విదేశాంగ విధానం ప్రపంచ వేదికపై నాయకత్వ పాత్రలను చేపట్టేలా అభివృద్ధి చెందుతోందన్నారు. ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగులో భాగంగా భారతదేశం 2022, డిసెంబర్ 1 నుండి జీ-20 ప్రెసిడెన్సీని చేపట్టనుందని తెలిపారు. జీ-20 ప్రెసిడెన్సీ అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన సమస్యలపై ప్రపంచ ఎజెండాకు సహకరించడానికి భారతదేశానికి ఒక ప్రత్యేక అవకాశాన్ని అందిస్తుందని, ఈ క్రమంలో మన యొక్క జీ-20 ప్రెసిడెన్సీ యొక్క లోగో, థీమ్ మరియు వెబ్సైట్ భారతదేశ సందేశాన్ని మరియు ప్రపంచానికి విస్తృతమైన ప్రాధాన్యతలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు. భారతదేశం తన జీ-20 ప్రెసిడెన్సీ సమయంలో, భారతదేశం అంతటా అనేక ప్రదేశాలలో 32 విభిన్న రంగాలలో సుమారు 200 సమావేశాలను నిర్వహిస్తుందని, అలాగే వచ్చే ఏడాది జరగనున్న జీ-20 సమ్మిట్, భారతదేశం నిర్వహించే అత్యున్నత స్థాయి అంతర్జాతీయ సమావేశాలలో ఒకటి అని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE