బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఏప్రిల్ నెల చివరిలో భారతదేశ పర్యటనకు రానున్నారు. ఈ మేరకు బ్రిటన్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ముందుగా గత రిపబ్లిక్ వేడుకల సందర్భంలోనే ముఖ్య అథితిగా ప్రధాని బోరిస్ జాన్సన్ భారత్ లో పర్యటించాల్సి ఉంది. అయితే ఆ సమయంలో యూకేలో కరోనా వ్యాప్తి ప్రభావం ఎక్కువుగా ఉండడంతో ఆయన భారత్ పర్యటనను రద్దు చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ నిష్క్రమించిన తర్వాత బోరిస్ జాన్సన్ తొలి అంతర్జాతీయ పర్యటనలో భాగంగా ఏప్రిల్ చివర్లో భారత్ కు రానున్నారు. జూన్ నెలలో బ్రిటన్ లో జరిగే గ్రూప్ ఆఫ్ సెవెన్ రిచ్ దేశాల(జీ7) సదస్సుకు ముందే భారత్ లో పర్యటించాలని బోరిస్ జాన్సన్ నిర్ణయించుకునట్టు తెలుస్తుంది. బ్రిటన్ ప్రభుత్వ విధానమైన ఇంటిగ్రేటెడ్ రివ్యూలో భాగంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంపై దృష్టి సారించే క్రమంలో ఈ పర్యటన ఉండబోతున్నట్టు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ