దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 23, ఆదివారం నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ భగవాన్ శ్రీ రాంలాలా విరాజ్మాన్ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రదేశాన్ని ప్రధాని పరిశీలిస్తారు. సాయంత్రం 5:45 గంటలకు శ్రీ రామ్ కథా పార్కులో నిర్వహించే శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు న్యూ ఘాట్, సరయూ నది వద్ద ఆరతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత భారీ స్థాయిలో నిర్వహించే దీపోత్సవ వేడుకలను ప్రధాని ప్రారంభిస్తారు.
ఈ ఏడాది దీపోత్సవ్ ఆరవ ఎడిషన్ను నిర్వహిస్తున్నారు, కాగా ఈ వేడుకల్లో ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా 15 లక్షలకుపైగా దీపాలు వెలిగించనున్నారు. అలాగే మ్యూజికల్ లేజర్ షోతో పాటు సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను కూడా ప్రధాని మోదీ వీక్షించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY