దీపావళి సందర్భంగా అక్టోబర్ 23న అయోధ్యలో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi will Visit Ayodhya on 23rd October on the eve of Deepavali Fetsival, PM Modi will Visit Ayodhya, PM Modi Ayodhya Visit, PM Modi Visit To Ayodhya, Mango News, Mango News Telugu,PM Modi Ayodhya Tour, Modi Tour To Ayodhya, Ayodhya Latest News And Updates, PM Modi Tour Live Updates, PM Narendra Modi Ayodhya Tour, National News, National Politics, PM BJP Party, Prime Minister Narendra Modi

దీపావళి పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 23, ఆదివారం నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్యను సందర్శించనున్నారు. సాయంత్రం 5 గంటలకు ప్రధాని మోదీ భగవాన్ శ్రీ రాంలాలా విరాజ్‌మాన్ ను దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రదేశాన్ని ప్రధాని పరిశీలిస్తారు. సాయంత్రం 5:45 గంటలకు శ్రీ రామ్ కథా పార్కులో నిర్వహించే శ్రీరాముని పట్టాభిషేక కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. సాయంత్రం 6:30 గంటలకు న్యూ ఘాట్, సరయూ నది వద్ద ఆరతి కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత భారీ స్థాయిలో నిర్వహించే దీపోత్సవ వేడుకలను ప్రధాని ప్రారంభిస్తారు.

ఈ ఏడాది దీపోత్సవ్ ఆరవ ఎడిషన్‌ను నిర్వహిస్తున్నారు, కాగా ఈ వేడుకల్లో ప్రధాని స్వయంగా పాల్గొనడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా 15 లక్షలకుపైగా దీపాలు వెలిగించనున్నారు. అలాగే మ్యూజికల్ లేజర్ షోతో పాటు సరయూ నది ఒడ్డున ఉన్న రామ్ కి పైడి వద్ద 3-డి హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ మ్యాపింగ్ షోను కూడా ప్రధాని మోదీ వీక్షించనున్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

six + thirteen =