ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు (జూన్ 3, శుక్రవారం) ఉత్తర్ ప్రదేశ్ లో పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు లక్నోలోని ఇందిరా గాంధీ ప్రతిష్ఠాన్కు ప్రధాని మోదీ చేరుకుని, అక్కడ యూపీ పెట్టుబడిదారుల సదస్సు 3.0 శంకుస్థాపన వేడుకలో పాల్గొంటారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాని మోదీ రూ.80,000 కోట్లకు పైగా విలువైన 1406 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇందులో వ్యవసాయం మరియు అనుబంధిత, ఐటీ మరియు ఎలక్ట్రానిక్స్, ఎంఎస్ఎంఈ, మాన్యుఫాక్చరింగ్, రెన్యువబుల్ ఎనర్జీ, ఫార్మా, పర్యాటకం, రక్షణ, ఏరోస్పేస్, చేనేత, టెక్స్టైల్స్ మొదలైన విభిన్న రంగాల ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ వేడుకకు దేశంలోని అగ్ర పరిశ్రమ నాయకులు హాజరుకానున్నారు.
అనంతరం మధ్యాహ్నం 1:45 గంటలకు, ప్రధాని మోదీ కాన్పూర్లోని పరౌంఖ్ గ్రామానికి చేరుకుంటారు. అక్కడ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్తో కలిసి పత్రి మాతా మందిరాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ భవన్ను, మిలన్ కేంద్రాన్ని సందర్శించనున్నారు. ఈ కేంద్రం అనేది రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ యొక్క పూర్వీకుల ఇల్లు కాగా, ఇది ప్రజల ఉపయోగం కోసం విరాళంగా ఇవ్వబడింది మరియు కమ్యూనిటీ సెంటర్ (మిలన్ కేంద్రం)గా మార్చబడింది. అనంతరం మధ్యాహ్నం 2:30 గంటలకు పరౌంఖ్ గ్రామంలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF