ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ఉదయం ఆమెకు ఆరోగ్యం క్షీణించడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన అహ్మదాబాద్లోని యూఎన్ మెహతా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్రభాయ్ పటేల్ ప్రధాన కార్యదర్శి కైలాసనాథన్ ఆస్పత్రికి చేరుకుని వైద్యులతో ప్రధాని తల్లి ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కాగా ఈ ఏడాది జూన్ 18న హీరాబెన్ మోదీకి 100 ఏళ్లు నిండాయి. ఆమె పుట్టినరోజు సందర్భంగా వాద్నగర్లోని హత్కేశ్వర్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే డిసెంబర్ 4న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండవ మరియు చివరి దశకు ముందు, గాంధీనగర్లోని రైసన్ ప్రాంతంలోని తమ నివాసంలో ప్రధాని మోదీ తన తల్లి హీరాబెన్ మోదీని కలిశారు. ఇక మంగళవారం మైసూరు సమీపంలో ప్రధాని మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ మరియు ఆయన కుటుంబ సభ్యులు పలువురు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురై గాయపడిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE