గుజరాత్లోని గిర్-సోమనాథ్ జిల్లాలోని ప్రభాస్ పటాన్ పట్టణంలోగల ప్రపంచ ప్రఖ్యాత సోమనాథ్ ఆలయ ట్రస్ట్కు కొత్త ఛైర్మన్గా ప్రధాని నరేంద్ర మోదీ నియమితులయ్యారు. సోమనాథ్ ఆలయ ట్రస్ట్ కు ఇప్పటికే ధర్మకర్తలలో ఒకరిగా ఉన్న ప్రధాని మోదీని ఏకగ్రీవంగా చైర్మన్ పదవికి ఎన్నుకున్నామని ట్రస్ట్ సెక్రెటరీ పీకే లెహ్రీ వెల్లడించారు. 2004 నుంచి 2020 వరకు గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్గా పనిచేశారు. గత అక్టోబర్ లో ఆయన మరణించిన తరవాత ఈ స్థానం ఖాళీగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం నాడు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా సోమనాథ్ ఆలయ ట్రస్ట్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ప్రధాని మోదీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మిగతా ధర్మకర్తలంతా ప్రధాన మోదీని తదుపరి ఛైర్మన్గా ఎన్నుకున్నారు. ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించేందుకు అంగీకరించి, సోమనాథ్ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ సమావేశం సందర్భంగా సౌకర్యాలు, కొనసాగుతున్న కార్యకలాపాలు మరియు ప్రాజెక్టులపై కూడా ప్రధాని మోదీ సమీక్ష నిర్వహించారు. గతంలో సోమనాథ్ ఆలయ ట్రస్ట్ చైర్మన్లుగా జంసాహెబ్ దిగ్విజయ సింగ్, కనయలాల్ మున్షి, భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్, జే కృష్ణహరి వల్లబ్, దినేష్ భాయ్ షా, ప్రసాన్వదన్ మెహతా మరియు కేశుభాయ్ పటేల్ వ్యవహరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ