తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం నాడు సిరిసిల్ల సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన 22 మంది విద్యార్థినులకు స్మార్ట్ ఫోన్లను అందజేశారు. ఫోన్ లేకపోవడంతో ఆన్లైన్ క్లాసులకు హాజరుకావడానికి ఈ విద్యార్ధినులు ఇబ్బంది పడుతున్న విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. దీంతో మంత్రి కేటీఆర్ వెంటనే స్పందిస్తూ “గిఫ్ట్ ఏ స్మైల్” కార్యక్రమం కింద 22 మంది విద్యార్థినులకు ప్రగతి భవన్ లో స్మార్ట్ ఫోన్లు అందజేశారు. ఈ సందర్భంగా తక్షణమే స్పందించి ఫోన్లు అందజేసినందుకు మంత్రి కేటీఆర్ కు మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కళ్యాణి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ