ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జూన్ 1, సోమవారం నాడు కేంద్ర కేబినెట్ భేటీ అయింది. ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారం చేపట్టి ఏడాది పూర్తై, రెండవ సంవత్సరంలోకి ప్రవేశించాక కేంద్ర కేబినెట్ మొదటిసారిగా సమావేశం అయింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్టు సమాచారం.
దేశంలో కరోనా వ్యాప్తి, సరిహద్దులో చైనాతో సమస్య, ఆర్ధికవ్యవస్థపై ప్రభావం వంటి కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే తాజాగా ప్రకటించిన లాక్డౌన్ లో భాగంగా ఫేజ్-1 లో జూన్ 8 నుంచి మతపరమైన ప్రదేశాలు, మాల్స్, రెస్టారెంట్లు తిరిగి తెరిచేందుకు అనుమతి ఇచ్చిన నేపథ్యంలో అందుకు సంబంధించిన విధివిధానాలు/మార్గదర్శకాలు పై కూడా ఈ భేటీలో చర్చించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu