కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో 48వ వస్తువులు మరియు సేవల పన్ను (జీఎస్టీ) కౌన్సిల్ సమావేశం శనివారం న్యూఢిల్లీలో జరిగింది. సమావేశం అనంతరం ఉన్నతాధికారులతో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. ఈరోజు జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏ వస్తువుపైనా పన్ను పెంపుదల విధించలేదని స్పష్టం చేశారు. అయితే కౌన్సిల్ మూడు రకాల నేరాలను నేరంగా పరిగణించాలని సిఫార్సు చేసినట్లు తెలిపారు. ఇక పొగాకు, గుట్కాపై పన్ను విధింపుపై ఈరోజు కౌన్సిల్ సమావేశం ఎజెండాలో ప్రధానాంశంగా ఉన్నప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. అలాగే ఆన్లైన్ గేమింగ్ మరియు క్యాసినోలపై జీఎస్టీపై చర్చించలేదని కూడా మంత్రి తెలియజేశారు. కాగా పప్పుల పొట్టుపై జీఎస్టీ తగ్గింపుకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్న నిర్మలా సీతారామన్, ఇదివరకు ఐదు శాతంగా ఉన్న దానిని సంపూర్ణంగా ఎత్తివేసినట్లు చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ