ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జూన్ 2, మంగళవారం నాడు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి పలు అంశాలు, ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై అమిత్ షాతో సీఎం వైఎస్ జగన్ చర్చించే అవకాశముంది. కరోనా వలన సుదీర్ఘంగా లాక్డౌన్ అమలులో ఉండడం, తదితర పరిణామాల తర్వాత తొలిసారిగా సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు.
శాసనమండలి రద్దు, మూడు రాజధానుల అంశం, ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం, కరోనా వలన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థపై ప్రభావం, పలు ఇతర విషయాలపై కూడా చర్చించే అవకాశం ఉన్నటు సమాచారం. అమిత్ షా తో పాటుగా అందుబాటులో ఉన్న ఇతర కేంద్రమంత్రులను కూడా కలుసుకొని, సీఎం వైఎస్ జగన్ బుధవారం నాడు తిరిగి రాష్ట్రానికి రానున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu