నేడు ‘విషు’ మరియు ‘గుడ్ ఫ్రైడే’ సందర్భంగా భారతీయులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా ఏసుక్రీస్తు సాహసాన్ని, త్యాగాలను ప్రధాని నరేంద్ర మోదీ స్మరించుకున్నారు. “ఈ రోజు గుడ్ ఫ్రైడే రోజున మేము యేసుక్రీస్తు ధైర్యాన్ని మరియు త్యాగాలను గుర్తుంచుకుంటాము. ఆయన సేవాభావాలు, సౌభ్రాతృత్వాలు ఎంతో మందికి మార్గదర్శకంగా నిలిచాయి” అని తన అధికారిక ట్విటర్లో మోదీ పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భాన క్రీస్తును సిలువ వేయడాన్ని స్మరించుకుంటారని, ఇది జీసస్ కోసం వారు తెలియజేసే పశ్చాత్తాపం అని ప్రధాని మోదీ చెప్పారు.
We remember the courage and sacrifices of Jesus Christ today on Good Friday. His ideals of service and brotherhood are the guiding light for several people.
— Narendra Modi (@narendramodi) April 15, 2022
Greetings on Vishu! pic.twitter.com/ymI3oIFQWn
— Narendra Modi (@narendramodi) April 15, 2022
అలాగే ఈరోజున దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కొత్త సంవత్సరాన్ని జరుపుకుంటున్న సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. కేరళ రాష్ట్ర సాంప్రదాయక నూతన సంవత్సరాది ‘విషు’ సందర్భంగా ప్రజలకు మంచి ఆరోగ్యం మరియు ఆనందం కోసం ప్రార్థిస్తున్నానని తెలిపారు. అలాగే పశ్చిమ బెంగాల్లో ‘పొయిలా బోయిషాక్’ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశంలోని అనేక ప్రాంతాలు తమ సాంప్రదాయ నూతన సంవత్సరాన్ని జరుపుకోవడం ఒక ఆనవాయితీ.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ