తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాష్ట్రంలో రెండో విడత ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను శుక్రవారం అలంపూర్ శక్తిపీఠం నుంచి ప్రారంభించిన విషయం తెలిసిందే. తొలిరోజు యాత్రను ఇమ్మాపూర్ లో ముగించగా, రెండు రోజు అక్కడ నుంచి బైరాపూర్ క్రాస్ రోడ్స్, బైరాపూర్ జి, లింగవాయి, బూడిదపాడు, ఉండవల్లి, చిన్న ఆముదాయాల పాడు, తక్షశిల మీదుగా ప్రగటూర్ వరకు సాగనుంది. బండి సంజయ్ రెండో రోజు ప్రజాసంగ్రామ యాత్రలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సహా పలువురు నాయకులు పాల్గొన్నారు. ప్రజల కష్టాలు తెలుసుకుని వారికి భరోసా కల్పించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంటుందని ఈ సందర్భంగా బండి సంజయ్ పేర్కొన్నారు.
ముందుగా బండి సంజయ్ ఆగస్టు 28, 20211న తొలిదశ పాదయాత్ర మొదలుపెట్టారు. తెలంగాణ ప్రజల్లో విశ్వాసం, ఆత్మస్థైర్యం కల్పించడానికే ఈ యాత్ర చేపట్టినట్టు తెలిపారు. అనంతరం అక్టోబరు 2, 2021న హుస్నాబాద్ పట్టణంలో భారీ బహిరంగ సభతో తొలిదశ పాదయాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో కొంత విరామం అనంతరం ఏప్రిల్ 14న జోగులాంబ గద్వాల్ నుంచి రెండో విడత పాదయాత్రను బండి సంజయ్ ప్రారంభించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ