దేశ ప్రజలకు 74వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, అమర జవాన్లకు నివాళులు

PM Narendra Modi Extends Wishes To Nation on The Eve of 74th Republic Day,PM Narendra Modi,Extends Wishes To Nation,Eve of 74th Republic Day,Mango News,Mango News Telugu,Republic Day,Decision on Republic Day Celebrations,Telangana Government's Decision,Republic Day Celebrations,Will Be Taken Into Consideration By The Central,Governor Tamilisai,Republic Day In India,Republic Day In Telangana,India Republic Day 2023,First Republic Day Of India,Republic Day Celebration In Hyderabad,Republic Day Events In Hyderabad,Republic Day Celebrations In India

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ పౌరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవం సందర్భంగా మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నందున ఈసారి ఈ సందర్భం కూడా ప్రత్యేకమైనది. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమర యోధుల కలలను నెరవేర్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు సాగాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగే కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్‌లో ఆయన తన సందేశాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన వర్ణరంజితమైన రాజస్థానీ తలపాగా విశేషంగా ఆకట్టుకుంది. ఈజిప్ట్‌ అధ్యక్షుడు అబ్దుల్‌ ఫతా అల్‌ సిసి విశిష్ఠ అతిథిగా పాల్గొనగా.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కాగా త్రివిధ దళాలు, బీఎస్‌ఎఫ్‌, వివిధ రెజిమెంట్లకు చెందిన సైనికులు కవాతు నిర్వహించగా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శనలు, సైనిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + 6 =