గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ పౌరులకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. స్వాతంత్య్ర అమృత్ మహోత్సవం సందర్భంగా మనం ఈ వేడుకలు జరుపుకుంటున్నందున ఈసారి ఈ సందర్భం కూడా ప్రత్యేకమైనది. దేశంలోని గొప్ప స్వాతంత్య్ర సమర యోధుల కలలను నెరవేర్చేందుకు అందరం ఐక్యంగా ముందుకు సాగాలి’ అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
गणतंत्र दिवस की ढेर सारी शुभकामनाएं। इस बार का यह अवसर इसलिए भी विशेष है, क्योंकि इसे हम आजादी के अमृत महोत्सव के दौरान मना रहे हैं। देश के महान स्वतंत्रता सेनानियों के सपनों को साकार करने के लिए हम एकजुट होकर आगे बढ़ें, यही कामना है।
Happy Republic Day to all fellow Indians!
— Narendra Modi (@narendramodi) January 26, 2023
ఇక ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవాల సందర్భంగా జరిగే కవాతుకు ముందు మోదీ జాతీయ యుద్ధ స్మారక స్థలం వద్ద అమర వీరులకు నివాళులర్పించారు. అనంతరం డిజిటల్ విజిటర్స్ బుక్లో ఆయన తన సందేశాన్ని నమోదు చేశారు. ఈ సందర్భంగా ఆయన ధరించిన వర్ణరంజితమైన రాజస్థానీ తలపాగా విశేషంగా ఆకట్టుకుంది. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దుల్ ఫతా అల్ సిసి విశిష్ఠ అతిథిగా పాల్గొనగా.. రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము జాతీయ జెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. కాగా త్రివిధ దళాలు, బీఎస్ఎఫ్, వివిధ రెజిమెంట్లకు చెందిన సైనికులు కవాతు నిర్వహించగా.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాల ప్రదర్శనలు, సైనిక విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE