పద్మ అవార్డులకు ఎంపికైన తెలంగాణ, ఏపీ సహా దేశంలోని పలురాష్ట్రాల ప్రముఖులకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

CM KCR Congratulates Padma Awards-2023 Winners from Telangana AP and Various States,Padma Awards 2023,Centre Announces 6 Padma Vibhushan, 9 Padma Bhushan,91 Padma Shri Awards,Mango News,Mango News Telugu,SL Bhairappa Literature and Education Karnataka,Kumar Mangalam Birla Trade and Industry Maharashtra,Deepak Dhar Science and Engineering Maharashtra,Vani Jayaram Art Tamil Nadu,Chinajiyar Swami Spiritual Telangana,Suman Kalyanpur Art Maharashtra,Kapil Kapoor Literature and Education Delhi,Sudhamurthy Social Work Karnataka,Kamlesh D Patel Spiritual Telangana,MM Keeravani Music Padmashri

సామాజిక, సాహిత్య, సంగీతం, భాష, ఆధ్యాత్మిక, సాంస్కృతిక, విద్యా, వైద్యం, శాస్త్ర సాంకేతిక రంగాలు సహా పలు ఇతర రంగాల్లో తమ జీవితకాలంలో చేసిన విశిష్ట సేవలను గుర్తించి ప్రతి ఏటా భారత ప్రభుత్వం ‘పద్మ’ అవార్డులను ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని 2023 సంవత్సరానికి గాను ‘పద్మ’ అవార్డులకు ఎంపికైన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులకు పేరు పేరునా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. సంఘ జీవనం సాగిస్తున్న వ్యక్తులుగా తాము ఎంచుకున్న రంగాల్లో అత్యంత ప్రతిభను కనబరుస్తూ, చిత్తశుద్ధితో, బాధ్యతను గుర్తెరిగి తనవంతుగా సమాజాన్ని గుణాత్మక దిశగా ముందుకు నడిపించడంలో ‘పద్మ’ అవార్డు గ్రహీతల పాత్ర ఎనలేనిదని సీఎం పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా ఆయా రంగాల్లో వారి విశేష కృషి రేపటి తరానికి మార్గదర్శకంగా నిలుస్తుందని, నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఆరుగురికి పద్మవిభూషణ్‌, తొమ్మిది మందికి పద్మభూషణ్‌, 91 మందికి పద్మశ్రీ పురస్కారాలను కలిపి దేశంలోని పలు రాష్ట్రాల ప్రముఖులకు మొత్తం 106 పద్మ పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. అవార్డు గ్రహీతలలో 19 మంది మహిళలు ఉన్నారు. విదేశీయులు/ఎన్ఆర్ఐ/పీఐఓ/ఓసీఐ చెందిన వారు ఇద్దరు ఉండగా, ఏడుగురు మరణానంతర అవార్డు గ్రహీతలు కూడా ఉన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి మొత్తం 12 పద్మ అవార్డులు దక్కాయి. తెలంగాణ నుంచి ఇద్దరికీ పద్మ భూషణ్‌తో పాటు ముగ్గురుకి పద్మశ్రీ అవార్డులు లభించాయి. తెలంగాణ నుంచి ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త చినజీయర్‌ స్వామి, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమలేశ్‌ డి పటేల్‌ పద్మభూషణ్‌ పురస్కారానికి ఎంపికయ్యారు. అలాగే మోదడుగు విజయ్‌ గుప్తా (సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌), హనుమంతరావు పసుపులేటి (వైద్యం), బి.రామకృష్ణారెడ్డి (సాహిత్యం, విద్య) విభాగాల్లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. ఇక ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు లభించాయి. ఆర్ట్ విభాగంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి, సీవీ రాజు, కోటా సచ్చిదానంద శాస్త్రిలకు, సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో గణేశ్‌ నాగప్ప కృష్ణరాజనగర, అబ్బారెడ్డి నాగేశ్వరరావులకు, సోషల్ వర్క్ విభాగంలో సంకురాత్రి చంద్రశేఖర్‌ కు, సాహిత్యం, విద్య విభాగంలో ప్రకాశ్‌ చంద్రసూద్‌ కు పద్మశ్రీ అవార్డు వరించింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 4 =