జపాన్ మాజీ ప్రధానమంత్రి షింజో అబేపై జరిగిన దాడిపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ “నా ప్రియమైన మిత్రుడు అబే షింజోపై జరిగిన దాడితో తీవ్ర మనోవేదనకు గురయ్యాను. మా ఆలోచనలు మరియు ప్రార్థనలు అతనితో, అతని కుటుంబ సభ్యులతో మరియు జపాన్ ప్రజలతో ఉన్నాయి” అని పేర్కొన్నారు. షింజో అబేపై జరిగిన కాల్పుల దాడిపై ప్రధాని మోదీ సహా పలు ప్రపంచ దేశాల అధినేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.
ముందుగా శుక్రవారం పశ్చిమ జపాన్లోని నరా నగరంలో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో లిబరల్ డెమోక్రాటిక్ పార్టీ తరపున షింజో అబే పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్టేజ్పై షింజో ప్రసంగిస్తున్న సమయంలో ఒక దుండగుడు ఆయనపై వెనుక నుంచి కాల్పులు జరిపారు. కాల్పుల గాయాలతో ఒక్కసారిగా షింజో అబే వేదికపైనే కుప్పకూలిపోయారు. అనంతరం షింజోను భద్రతా సిబ్బంది వెంటనే అత్యవసర వాహనంలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే షింజో పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఈ ఘటనపై జపాన్ ప్రధాని పూమియో కీషీదా స్పందిస్తూ, షింజోను కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఆయన క్షేమంగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్దిస్తునట్టు తెలిపారు. ఇలాంటి హింసాత్మక ఘటనలను సహించేది, క్షమించేది లేదన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY