కోవిడ్-19(కరోనా వైరస్) సంక్షోభం నేపథ్యంలో భారత్ కు వెంటిలేటర్లను విరాళంగా అందిస్తామని అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ” భారతదేశంలోని మా స్నేహితులకు వెంటిలేటర్లను అమెరికా విరాళంగా ఇస్తుందని ప్రకటించడం గర్వంగా ఉంది. కరోనా మహమ్మారి సమయంలో మేము భారతదేశంతో మరియు ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి నడుస్తాం. కరోనా టీకా అభివృద్ధికి కూడా మేము సహకరిస్తాం. మనం కలిసి ఈ అదృశ్య శత్రువును ఓడిద్దామని” డోనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో భారత్ కు వెంటిలేటర్లను విరాళంగా అందిస్తామని డోనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందిస్తూ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ప్రదాని మోదీ ట్వీట్ చేశారు. ” ఈ కరోనా మహమ్మారి మనందరిపై సమిష్టిగా ప్రభావం చూపుతుంది. ఇలాంటి సమయాల్లో దేశాలు అన్ని కలిసి పనిచేయడం ఏంతో ముఖ్యం. ఈ ప్రపంచాన్ని ఆరోగ్యంగా ఉంచడం మరియు కోవిడ్-19 నుండి త్వరగా విముక్తి పొందటానికి సాధ్యమైనంతగా సహకారం అందించుకోవడం ముఖ్యమని” ప్రధాని మోదీ పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో గతంలో అమెరికాకు భారీస్థాయిలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్స్ ను భారత్ సరఫరా చేసిన సంగతి తెలిసిందే.
Thank you @POTUS @realDonaldTrump.
This pandemic is being fought collectively by all of us. In such times, it’s always important for nations to work together and do as much as possible to make our world healthier and free from COVID-19.
More power to 🇮🇳 – 🇺🇸 friendship! https://t.co/GRrgWFhYzR
— Narendra Modi (@narendramodi) May 16, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu