కరోనా వైరస్ ను కట్టడి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు సాయంగా ప్రముఖ కంపెనీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, పారిశ్రామిక వేత్తలు, సినీ ప్రముఖులు, అన్ని వర్గాల నుంచి తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందుతున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వం చర్యలకు మద్దతుగా తెలంగాణ కాటన్ మిల్లర్స్ & ట్రేడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీఎం సహాయనిధికి రూ.35 లక్షల విరాళాన్ని ప్రకటించింది. అందుకు సంబంధించిన చెక్కును ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి తదితరులు ఈ రోజు ప్రగతిభవన్ లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావును కలుసుకుని అందజేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu