భారత ప్రధాని నరేంద్ర మోదీ అంతర్జాతీయస్థాయిలో అత్యంత ఆమోదయోగ్యమైన నేతల్లో మొదటిస్థానంలో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన గ్లోబల్ అప్రూవల్ రేటింగ్స్ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో నిలిచి తన ఛరిష్మాను మరోసారి చాటారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సహా 13 మంది ప్రపంచనేతలు ఉన్న ఈ జాబితాలో 70 శాతం ఆమోదం రేటింగ్ తో ప్రధాని మోదీనే అగ్రస్థానం దక్కించుకున్నారు. ఇక మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రాడోర్ 66 శాతంతో రెండో స్థానంలో, ఇటలీ ప్రధాని మారియో డ్రాగి 58 శాతంతో మూడో స్థానంలో, జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ 54 శాతంతో నాలుగో స్థానంలో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47 శాతంతో ఐదో స్థానంలో నిలిచారు. అయితే అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు టాప్-5 లో చోటుదక్కలేదు, ఆయన ఆరు స్థానంలో ఉన్నారు. మరోవైపు మార్నింగ్ కన్సల్ట్ గతఏడాది నిర్వహించిన సర్వేలో కూడా ప్రధాని మోదీనే అగ్రస్థానంలో నిలిచారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ