మాజీ ప్రధాని, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్పేయి 4వ వర్ధంతి సందర్భంగా న్యూఢిల్లీలోని వాజ్పేయి స్మారకం ‘సదైవ్ అటల్’ వద్ద పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కేంద్రమంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు సదైవ్ అటల్ ను సందర్శించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రార్థనా సమావేశంలో కూడా నాయకులు పాల్గొన్నారు.
అనంతరం ప్రధాని మోదీ ట్వీట్ చేస్తూ, “నేడు అటల్ జీ పుణ్యతిథి సందర్భంగా సదైవ్ అటల్ను సందర్శించి, ఆయనకు నివాళులర్పించాను. భారతదేశానికి సేవ చేయడానికి అటల్ జీ చేసిన ప్రయత్నాల నుండి మేము స్ఫూర్తి పొందుతున్నాము. అతను భారతదేశాన్ని మార్చడానికి మరియు 21వ శతాబ్ధపు సవాళ్లకు మన దేశాన్ని సిద్ధం చేయడానికి మార్గదర్శక ప్రయత్నాలు చేశారు” అని పేర్కొన్నారు. బీజేపీలో అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా, పార్టీ అగ్రనేతగా అటల్ బిహారీ వాజ్పేయి ఉన్నారు. మూడు పర్యాయాలు ఆయన భారత ప్రధానిగా సేవలు అందించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY