తెలంగాణ రాష్ట్ర హైకోర్టుకు ఇటీవలే కొత్తగా ఆరుగురు న్యాయమూర్తులు(జడ్జిలు) నియమితులైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో హైకోర్టు న్యాయమూర్తులుగా వారు మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్ న్యాయమూర్తులుగా ప్రమాణం చేయగా, అనంతరం జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టులో మొదటి కోర్టు హాల్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో వీరి చేత తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ ప్రమాణస్వీకారం చేయించారు.
ముందుగా సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం న్యాయవాదులు అయిన ఏనుగుల వెంకట వేణుగోపాల్, భీమపాక నగేశ్, పుల్లా కార్తీక్, కాజా శరత్, జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్రావు లకు పదోన్నతి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులుగా సిఫార్సు చేసింది. అనంతరం వీరి నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే వీరు నేడు న్యాయమూర్తులుగా ప్రమాణం స్వీకారం చేశారు. కాగా తెలంగాణ హైకోర్టులో మొత్తం న్యాయమూర్తులు సంఖ్యను కేంద్రం 42కి పెంచిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు 28 మంది న్యాయమూర్తులు ఉండగా, కొత్తగా ఆరుగురు బాధ్యతలు స్వీకరించడంతో మొత్తం సంఖ్య 34కి చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY