ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము తన తొలి యుద్ధ విమానంలో శనివారం అస్సాంలోని తేజ్పూర్ ఎయిర్ఫోర్స్ స్టేషన్లో సుఖోయ్ 30 ఎంకేఐ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో బయలుదేరింది. మూడు రోజుల అస్సాం పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానంలో విహరించారు. చైనా సరిహద్దు సమీపంలోని తవాంగ్ సెక్టార్కు దగ్గరగా ఉండే తేజ్పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో శనివారం సార్టీ నిర్వహించారు. కాగా అంతకుముందు 2009లో మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఫ్రంట్లైన్ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్లో ప్రయాణించారు. ఇక సుఖోయ్ 30 ఎంకేఐ అనేది భారత్ అమ్ములపొదిలోని ట్విన్ సీటర్ ఫైటర్ జెట్. దీన్ని రష్యాకు చెందిన సుఖోయ్ సంస్థ డెవలప్ చేయగా.. హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థ నిర్మించింది. కాగా ప్రాజెక్ట్ ఎలిఫెంట్కు 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా.. శుక్రవారం ఖాజిరంగా నేషనల్ పార్క్లో ‘గజ్ ఉత్సవ్ 2023’ని ఆమె ప్రారంభించిన విషయం తెలిసిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE