తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, కానీ రాష్ట్రం కేంద్రప్రభుత్వంతో కలిసి రావడం లేదని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. శనివారం ఆయన హైదరాబాద్ పర్యటన సందర్భంగా.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వద్ద సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు రోడ్డు రవాణా శాఖ ప్రాజెక్టులకు, బీబీనగర్లోని ఎయిమ్స్ నూతన భవన సముదాయానికి (వర్చువల్గా), సికింద్రాబాద్ స్టేషన్ పునరాభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. సికింద్రాబాద్-మహబూబ్నగర్ మధ్య పూర్తి చేసిన డబ్లింగ్, విద్యుద్దీకరణ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అలాగే సికింద్రాబాద్-మేడ్చల్ మధ్య కొత్త ఎంఎంటీఎస్ సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై, కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, మరో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ సీఎం కేసీఆర్ మరియు బీఆర్ఎస్ ప్రభుత్వంపై పరోక్షంగా విమర్శలు చేశారు.
ప్రధాని మోదీ ప్రసంగంలోని కొన్ని కీలక అంశాలు..
- ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభిస్తూ సోదర సోదరీమణులకు స్వాగతం అని చెప్పారు.
- ఏపీ-తెలంగాణ రాష్ట్రాలను సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుతో అనుసంధానం చేశాం.
- ఒకే రోజు 13 ఎంఎంటీఎస్ రైళ్లను ప్రారంభించాం, అలాగే ఎంఎంటీఎస్ విస్తరణ కోసం రూ.600 కోట్లు కేటాయింపు.
- తెలంగాణలో నాలుగు హైవేలకు శ్రీకారం చుట్టాం. హైదరాబాద్ రింగ్రోడ్డు ప్రాజెక్టు కూడా అమల్లో ఉంది.
- దేశాభివృద్ధిలో తెలంగాణ భాగమయ్యేలా చూశాం. హైదరాబాద్- బెంగళూరు అనుసంధాన్ని మెరుగుపరుస్తున్నాం.
- దేశవ్యాప్తంగా 7 మెగా టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటు చేస్తున్నాం.. తెలంగాణలో కూడా ఒక మెగా టెక్స్టైల్స్ పార్కు ఏర్పాటు చేస్తాం.
- దేశంలో వారసత్వ రాజకీయాల్లో భాగంగా పేదల రేషన్ కూలా లాక్కున్నారు, అయితే మేము నేడు 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందిస్తున్నాం.
- కుటుంబవాదంతో రాజకీయాలు నడపాలని చూస్తున్నారు. దీనిని కాపాడుకోవడం కోసం ప్రతీ వ్యవస్థను తమ అదుపులో పెట్టుకోవాలని భావిస్తున్నారు.
- ఈ తరుణంలో దేశాన్ని అవినీతి నుంచి విముక్తి చేయాలా వద్దా? అవినీతిపరులపై పోరాటం చేయాలా?.. వద్దా? అవినీతిపరులపై చట్టప్రకారం చర్యలు చేపట్టాలా.. వద్దా?
- తెలంగాణ ప్రభుత్వం కేంద్రంతో కలిసి రావడం లేదు, అందుకే అభివృద్ధి పనుల్లో ఆలస్యం జరుగుతోంది.
- తెలంగాణలో కుటుంబపాలనతో అధికారం కొందరి గుప్పెట్లోనే మగ్గుతోంది, వారు అవినీతిని పెంచిపోషిస్తున్నారు.
- ప్రజల సొమ్ము అవినీతిపరులకు చేరకుండా చర్యలు చేపట్టాం, డిజిటల్ పేమెంట్స్ ద్వారా దళారీ వ్యవస్థ లేకుండా చేశాం.
- అందుకే నేరుగా రైతులు, విద్యార్థుల ఖాతాల్లోనే ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధులు జమ చేస్తున్నాం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE