రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి (నవంబర్ 2, బుధవారం) నవంబర్ 5 వరకు 4 రోజుల పాటు నాగాలాండ్, మిజోరాం, సిక్కిం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి సెక్రటేరియట్ ఒక ప్రకటన విడుదల చేసింది. ముందుగా బుధవారం కోహిమాలో నాగాలాండ్ ప్రభుత్వం రాష్ట్రపతి గౌరవార్థం నిర్వహించే పౌర రిసెప్షన్కు రాష్ట్రపతి హాజరవుతారు. ఆ సందర్భంగా రాష్ట్రంలో విద్య, మౌలిక సదుపాయాలకు సంబంధించిన పలు ప్రాజెక్టులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. నవంబర్ 3, గురువారం ఉదయం కోహిమా వార్ సిమెటేరి వద్ద రాష్ట్రపతి నివాళులర్పించనున్నారు. అనంతరం కిగ్వేమా గ్రామాన్ని సందర్శించి, అక్కడ విలేజ్ కౌన్సిల్ సభ్యులు మరియు స్వయం సహాయక సంఘాల సభ్యులతో ఆమె సంభాషిస్తారు.
అదే రోజు ఐజ్వాల్లోని మిజోరాం విశ్వవిద్యాలయం యొక్క 17వ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి పాల్గొని, మిజోరాం రాష్ట్రంలో వివిధ విద్యా సంబంధిత ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. సాయంత్రం ఐజ్వాల్లోని రాజ్భవన్లో రాష్ట్రపతి గౌరవార్థం మిజోరాం ప్రభుత్వం నిర్వహించనున్న పౌర రిసెప్షన్కు కూడా హాజరవుతారు. అలాగే నవంబర్ 4, శుక్రవారం ఐజ్వాల్లో మిజోరాం శాసనసభ సభ్యులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. అదే రోజున ఆమె గౌరవార్థం సిక్కిం ప్రభుత్వం నిర్వహించే పౌర సత్కారానికి హాజరవుతారు మరియు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల వివిధ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. ఇక నవంబర్ 5, శనివారం రాష్ట్రపతి ఢిల్లీకి తిరిగి రావడానికి ముందు తథాగత త్సల్, రావొంగ్లాలో మహిళా సాధకులు మరియు స్వయం సహాయక సంఘాల సభ్యులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంభాషించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE