నేటి నుంచి రెండ్రోజుల పాటుగా పశ్చిమబెంగాల్‌లో పర్యటించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President Droupadi Murmu will Visit West Bengal from March 27 to 28th,President Droupadi Murmu will Visit West Bengal,Droupadi Murmu West Bengal Visit,President West Bengal Visit from March 27 to 28th,Mango News,Mango News Telugu,President of India to Visit West Bengal,President Droupadi Murmu,President Murmu To Go on Two Day Visit,President of India Smt. Droupadi Murmu,President Droupadi Murmu Latest News,President Droupadi Murmu Latest Updates

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మార్చి 27, 28 తేదీల్లో పశ్చిమబెంగాల్‌ లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మార్చి 27, సోమవారం కోల్‌కతాలోని నేతాజీ భవన్‌ను సందర్శించి నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు రాష్ట్రపతి నివాళులర్పిస్తారు. అనంతరం ఆమె గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్‌కు నివాళులు అర్పించేందుకు జోరాసంకో ఠాకూర్‌బారి-రవీంద్రనాథ్ ఠాగూర్ ఇంటిని సందర్శిస్తారు. ఇక సోమవారం సాయంత్రం కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియంలో రాష్ట్రపతి గౌరవార్థం ఏర్పాటు చేయనున్న పౌర రిసెప్షన్‌లో రాష్ట్రపతి పాల్గొననున్నారు.

అదేవిధంగా మార్చి 28, మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బేలూరు మఠాన్ని సందర్శించనున్నారు. కోల్‌కతాలో యూకో బ్యాంక్‌కి 80 ఏళ్లు పూర్తిచేసుకున్న వేడుకకు ఆమె హాజరుకానున్నారు. ఆ తర్వాత, రాష్ట్రపతి శాంతినికేతన్‌ను సందర్శించి, అక్కడ ఆమె విశ్వభారతి వార్షిక స్నాతకోత్సవంలో పాల్గొననున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 3 =