దేశంలోని పలు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి ప్రభావం కొనసాగుతుంది. గత 24 గంటల్లో కొత్తగా 1805 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మార్చి 27, సోమవారం ఉదయం 8 గంటల నాటికీ మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,47,05,952 కు చేరుకుంది. ముఖ్యంగా మహారాష్ట్ర, గుజరాత్, కేరళ, కర్ణాటక, ఢిల్లీ, తమిళనాడు వంటి రాష్ట్రాల్లోనే కొత్త కరోనా కేసుల నమోదు కొంత ఎక్కువుగా ఉంది. అలాగే కరోనా వలన మరో 6 మరణాలు (చండీగర్ లో 1, గుజరాత్ లో 1, హిమాచల్ ప్రదేశ్ లో 1, ఉత్తర్ ప్రదేశ్ లో 1, కేరళలో రికాంసైల్డ్ 2) నమోదు కావడంతో, నమోదు కావడంతో, మొత్తం మరణాల సంఖ్య 5,30,837కి పెరిగింది.
అలాగే మరో 932 మంది బాధితులు కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,41,64,815 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.79 శాతం గానూ, మరణాల రేటు 1.19 శాతంగా ఉంది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం యాక్టీవ్ కరోనా కేసులు సంఖ్య ప్రస్తుతం 10,300 (0.02%) కి చేరింది. ఇక దేశంలో గత 24 గంటల్లో 56,551 కరోనా పరీక్షలు నిర్వహించగా, రోజువారీ పాజీటివిటీ రేటు 3.19 శాతంగా నమోదైంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE