తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్-19(కరోనా వైరస్) పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. ఏప్రిల్ 13, సోమవారం నాడు ఒక్కరోజే కొత్తగా 61 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 592కు చేరుకుంది. సోమవారం మరో కరోనా మరణం కూడా నమోదవడంతో ఇప్పటివరకు ఈ వైరస్ వలన రాష్ట్రంలో ఇప్పటివరకు 17 మంది మరణించారు. ఇక 103 మంది కోలుకుని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 472 మంది కరోనా బాధితులు ఐసొలేషన్ వార్డుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 216 మందికి కరోనా వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 51 మంది కరోనా లక్షణాల నుంచి కోలుకొని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.
ఈ నేపథ్యంలో అత్యధిక జనసమ్మర్థం ఉండే జీహెచ్ఎంసీలో పాజిటివ్ కేసులు ఎక్కువవుతుండడాన్ని అత్యంత తీవ్రమైన విషయంగా పరిగణించి, మున్సిపల్ శాఖ, వైద్య ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులు ప్రతీ రోజు ప్రగతి భవన్ లోనే సర్కిళ్ల వారీగాప్రత్యేక సమీక్ష జరిపి, పరిస్థితికి తగ్గట్టు అవసరమైన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 14, మంగళవారం ఉదయానికి రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473 కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో గత 24 గంటల్లో 2010 సాంపిల్స్ పరీక్షించగా 41 మందికి కొత్తగా కరోనా పాజిటివ్ గా నిర్దారించబడ్డాయని చెప్పారు.
Media bulletin with district wise break up on status of positive cases of #COVID19 in Telangana (Dated: 13.04.2020) pic.twitter.com/0IWjCYWneC
— Minister for Health Telangana State (@TelanganaHealth) April 13, 2020
రాష్ట్రంలో నిన్న సాయంత్రం 5 నుంచి ఈరోజు ఉదయం 9 వరకు జరిగిన కోవిడ్19 పరీక్షల్లో గుంటూరు లో 16, కృష్ణ లో 8, కర్నూల్ లో 7, అనంతపూర్ లో 2 మరియు నెల్లూరు లో ఒక కేసు నమోదయ్యాయి. కొత్తగా నమోదైన 34 కేసుల తో రాష్ట్రం లో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 473 కి పెరిగింది. #APFightsCorona pic.twitter.com/WkAzHGTuJC
— ArogyaAndhra (@ArogyaAndhra) April 14, 2020
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]