కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, కీలక నేత ప్రియాంకా గాంధీ వాద్రాకి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని ఆమే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. “మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. అన్ని ప్రోటోకాల్లను అనుసరించి, ఇంట్లోనే ఐసోలేషన్ లో ఉన్నాను” అని ప్రియాంకా గాంధీ ట్వీట్ చేశారు. కాగా గత జూన్ లో కూడా ప్రియాంకా గాంధీ కరోనా బారినపడి కోలుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ప్రతిపక్ష నాయకుడు మల్లిఖార్జున ఖర్గే కూడా తనకు కరోనా సోకినట్లు ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారంతా జాగ్రత్తగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేశారు. మల్లిఖార్జున ఖర్గే రెండు రోజుల క్రితం రాజ్యసభ సమావేశాలకు కూడా హాజరయ్యారు. అలాగే పార్లమెంట్ లైబ్రరీ బిల్డింగ్ లోని జీఎంసీ బాలయోగి ఆడిటోరియంలో సోమవారం ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు వీడ్కోలు కార్యక్రమంలో కూడా ఖర్గే పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, స్పీకర్ ఓం బిర్లా సహా పలువురు ఎంపీలు కూడా హాజరయ్యారు. ఈ క్రమంలో ఖర్గేకు కరోనా పాజిటివ్ గా తేలడంతో ఆందోళన నెలకుంది. ఇక దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 4,41,90,697 కు చేరుకుంది. అలాగే కొత్తగా మరో 54 మరణాలు నమోదవడంతో మొత్తం మరణాల సంఖ్య 5,26,826 కి పెరిగింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY