పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ గురువారం నాడు ఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానితో సీఎం భగవంత్ మాన్ భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. ఈ భేటీ సందర్భంగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చినట్టు తెలుస్తుంది. అనంతరం సీఎం భగవంత్ మాన్ మీడియాతో మాట్లాడుతూ, దేశ భద్రతను కాపాడేందుకు తమకు కేంద్రం మద్దతు కావాలని చెప్పారు.
అలాగే పంజాబ్ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం గొప్పగా లేదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు 2 సంవత్సరాల పాటుగా సంవత్సరానికి రూ.50,000 కోట్ల చొప్పున ప్యాకేజీని ఇవ్వాలని ప్రధాని మోదీని కోరినట్టు తెలిపారు. మరోవైపు గురువారం ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తో కూడా సీఎం భగవంత్ మాన్ భేటీ కానున్నట్టు తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ