పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్జిత్ సింగ్ చన్నీ శుక్రవారం నాడు ఢిల్లీలో 7 లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని అధికార నివాసంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పంజాబ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ప్రధానితో సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ భేటీ అవ్వడం ఇదే మొదటి సారి. ఈ భేటీ సందర్భంగా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను చర్చినట్టు తెలుస్తుంది. భేటీ అనంతరం సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ మాట్లాడుతూ వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసన అంశాన్ని త్వరగా పరిష్కరించాలని, రైతులతో మళ్లీ చర్చలు జరపాలని ప్రధానిని కోరినట్టు తెలిపారు. అలాగే అక్టోబర్ 1 నుండి పంజాబ్లో వరి సేకరణను వాయిదా వేయాలంటూ రాష్ట్రానికి కేంద్రం పంపిన లేఖను ఉపసంహరించుకోవాలని కోరినట్టు చెప్పారు. అలాగే కోవిడ్-19 మహమ్మారి కారణంగా మూసివేయబడిన కర్తార్పూర్ కారిడార్ను వీలైనంత త్వరగా తిరిగి తెరవాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేసినట్టు పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ