రాష్ట్రంలోని యువకులకు మొబైల్ ఫోన్ల పంపిణీ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆగస్టు 11, మంగళవారం నాడు పంజాబ్ ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో విద్యా సంస్థలు మూసివేయడం వలన కొంతమంది యువకులు ఆన్లైన్ క్లాసులకు హాజరు కాలేక తీవ్రమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని, ఈ నేపథ్యంలోనే యువతకు సెల్ ఫోన్లు (స్మార్ట్ ఫోన్లు) అందించేందుకు ప్రత్యేక పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్టు పంజాబ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ ఫోన్లు ద్వారా వెబ్లో అందుబాటులో ఉన్న సమాచారంతో పాటుగా రాష్ట్ర పాఠశాల విద్యా శాఖ పోస్టు చేసే లెర్నింగ్ మెటీరియల్ కూడా యువతకు ఎంతో సహాయపడతాయని పేర్కొన్నారు. మొదటి విడతలో భాగంగా సుమారు 1.75 లక్షల సెల్ ఫోన్లు అందజేయనున్నారు. మరోవైపు 2017 లో అధికారంలోకి వచ్చే ముందే రాష్ట్రంలోని యువతకు ఉచితంగా స్మార్ట్ ఫోన్లు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu