ప్రముఖ వ్యాపార దిగ్గజం.. బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్, పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ శనివారం కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 83. ఈ మేరకు బజాజ్ గ్రూప్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. రాహుల్ బజాజ్, 1972లో బజాజ్ గ్రూప్ బాధ్యతలను స్వీకరించారు. దాదాపు 5 దశాబ్దాల పాటు భారతదేశంలోని రెండవ అతిపెద్ద మోటార్సైకిల్ ఉత్పత్తిదారుగా ఉన్న బజాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలలో వివిధ బాధ్యతలు నిర్వర్తించారు. రాహుల్ బజాజ్ 2006 నుంచి 2010 వరకు రాజ్యసభ సభ్యుడిగా కూడా పని చేశారు. కాగా, రాహుల్ బజాజ్ కు ఇద్దరు కుమారులు.. రాజీవ్ బజాజ్ మరియు సంజీవ్ బజాజ్ మరియు ఒక కుమార్తె సునైనా కేజ్రీవాల్ ఉన్నారు.
గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. ఈరోజు మధ్యాహ్నం 2:30 గంటల ప్రాంతంలో మరణించారు. రేపు పూణేలో ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు గ్రూప్ బజాజ్ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యాపార రంగంలో ఆయన చేసిన సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం.. ఆయనను అత్యున్నత పురస్కారాలలో ఒకటైన ‘పద్మభూషణ్’ అవార్డుతో గౌరవించింది. కాగా.. ఆయన మృతిపై దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. “గత ఐదు దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్కు నాయకత్వం వహించిన రాహుల్ జీ పరిశ్రమలో కీలక పాత్ర పోషించారు. దేవుడు మరణించిన ఆత్మకు శాంతి చేకూర్చాలని మరియు కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ