కరోనాతో బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత

BJP MLA Died due to Covid-19, BJP MLA Kiran Maheshwari Died, Coronavirus, Coronavirus Cases, coronavirus india, coronavirus news, Coronavirus outbreak, Coronavirus Update, COVID-19, COVID-19 Cases, Mango News Telugu, MLA Kiran Maheshwari, Rajasthan BJP MLA Kiran Maheshwari Died, Rajasthan BJP MLA Kiran Maheshwari Died due to Covid-19

కరోనా మహమ్మారి వలన దేశంలో ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు కన్నుమూశారు. ఈ నేపథ్యంలో రాజస్థాన్ బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి(59) కూడా కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గత నెలలో కరోనా పాజిటివ్ గా తేలిన అనంతరం ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం అర్ధరాత్రి ఆమె తుదిశ్వాస విడిచినట్టు తెలిపారు. రాజస్థాన్ బీజేపీలో ఆమె కీలక బాధ్యతలు నిర్వహించేవారు. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ఆమె సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె రాజసమంద్ నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తుండగా, ఈ నియోజకవర్గం నుంచి ఆమె మూడు సార్లు ఆమె విజయం సాధించారు. 2004 లో ఉదయపూర్ నుంచి లోక్‌సభ ఎంపికయ్యారు. ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి మృతి పట్ల ప్రధాని మోదీ, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ సహా పలువురు నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 4 =